ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్ ,అర్జున్ సమాచారం : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి గ్రామంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను బుధవారం అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి సకాలంలో పూర్తి చేయిస్తూ నివేదిక సమర్పించాలన్నారు. నాణ్యత పాటిస్తూ గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్మాణ పరిసరాలను...