ఉపముఖ్యమంత్రి భట్టిని కలిసిన మారిషస్ అధికార బృందం హైదరాబాద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మంత్రి లచ్మునా రాజ్ పెంటియా  నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం నాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను  మర్యాదపూర్వకంగా కలిశారు. మారిషస్లో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు విద్య, పరిశోధన, కళా రంగాల్లో సంపూర్ణ సహకారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ======================