అమరావతి,అర్జున్ సమాచారం:
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు ముంబయిలో నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయింది.
ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కల్యాణ్ కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు.
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతో పాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది, ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టింది.
ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
====================