ఏసీబీ వలకు చిక్కిన ప్రశంసా పత్రం అందుకున్న “ఉత్తమ అధికారి”..

ఒంగోలు,అర్జున్ సమాచారం: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కుకున్నాడు.  రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఆర్ఐ ఏసీబీకి చిక్కాడు.* ఒంగోలు కార్పొరేషన్ ఆర్ఐ నరేంద్రను లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.  కొత్త ఇంటికి పన్ను విధించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ.  లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి  నరేంద్ర చిక్కాడు. * ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘ఉత్తమ అధికారి’గా మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాడు.  ఇప్పుడు ఏసీబీకి చిక్కడం తీవ్ర చర్చకు దారితీసింది.....