కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ కు అడుగడుగునా జననీరాజనం

పెనమలూరు,అర్జున్ సమాచారం: కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ కు అడుగడుగునా జననీరాజనం లభించింది. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ కు  పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు వద్ద మంత్రి లోకేష్ కు  టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ కు మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము తదితరులు స్వాగతం...