కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ,అర్జున్ సమాచారం: రీజిన‌ల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్త‌ర భాగానికి సంబంధించి ఇప్ప‌టికే 95 శాతం భూసేక‌ర‌ణ పూర్త‌యిన నేపథ్యంలో ప‌నుల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి అనుమ‌తి ఇప్పించాల‌ని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ కి విజ్ఞ‌ప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలు రెండువైపులా ఏక‌కాలంలో పనులు ప్రారంభ‌మైతే నిర్మాణం త్వ‌ర‌గా పూర్తికావడమే కాకుండా నిర్మాణ వ్య‌యం త‌గ్గుతుంద‌ని వివరించారు. కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ తో ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో...