హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్తో పాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో వరదలు రావడానికి చెరువులు, కాలువలు ఆక్రమణకు గురికావడమే ప్రధాన కారణమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ముస్సోరీలోని ఐఏఎస్ అధికారుల శిక్షణలో ఆయన ప్రసంగిస్తూ. సహజ నీటి ప్రవాహ మార్గాలను, గొలుసుకట్టు చెరువులను కాపాడుకుంటేనే వరదలను అరికట్టగలమని చెప్పారు. అందుకే హైదరాబాద్లో చెరువులు, కాలువల పరిరక్షణకు హైడ్రా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.
==========================