జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులను సన్మానించిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

గోదావరిఖని ,అర్జున్ సమాచారం : రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు  ఎం.ఎస్. రాజ్ ఠాకూర్  జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా SIMS మెడికల్ కాలేజీ యాజమాన్యం ఆహ్వానం మేరకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  కేక్ కట్ చేసి వైద్యులకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. అలాగే మెడికల్ విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి, వారి విద్యాభ్యాసం, లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. రానున్న...