పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
అర్జున్ సమాచారం: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త వినబోతున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఒప్పించి అనుమతులు సాధించే దిశగా ముందుకు వెళుతున్నట్టు ప్రకటించారు. డిండి ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపులపైన కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్లో స్థాపించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (CQP) తయారీ యూనిట్ను...