హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ఆర్టీసీ స్పేషల్ బస్సులలో ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతున్నాయి. పండుగల పేరుతో ఇష్టానుసారంగా చార్జీలు పెంచుతున్నారు.
హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు నార్మల్ ఛార్జ్ 290. పండుగ పేరుతో 1:50 రూల్ పేరుతో అదనంగా 100 నుంచి 150 చార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు మెట్రో డిలక్స్ స్పెషల్
బస్ లో 400 వసూలు చేస్తారు. సూపర్ లగ్జరీ బస్సులు లో అదనపు చార్జీల బాదుడు కొనసాగింది. ప్రయాణికులు లబో దిబో అంటున్నారు. స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కిన తర్వాత మార్గ మధ్యం
లో ఎక్కువ చార్జీలు ఆర్టీసీ కండక్టర్ లు వసూలు చేస్తున్నారు. అధికారులు ఆర్టీసీ ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు.
========================