ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 6:12 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సంగీత్’ మూవీ నుంచి తొలిపాట ‘నీ వల్లే’ విడుదల

*తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ‘ఎక్స్’ ద్వారా చిత్ర గీతాన్ని విడుదల చేసిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్
అచు రాజామణి మెలోడీకి విక్రమ్ శివ హృద్యమైన సాహిత్యం.. నిఖిల్ విజయేంద్ర సింహా, తేజు అశ్విని జంటను పరిచయం చేసిన అందమైన ప్రేమగీతం ఇది.
యువతను ఆకట్టుకునే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘సంగీత్’ నుంచి తొలి పాట ‘నీ వల్లే’ విడుదలైంది. కథానాయకుడు నిఖిల్ విజయేంద్ర సింహా ఆయన అభిమానులకు, సంగీత ప్రియులకు ‘నీ వల్లే’ ఒక ప్రత్యేకమైన మ్యూజికల్ ట్రీట్‌గా నిలిచింది. సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న సిద్ శ్రీరామ్ గాత్రం, ప్రముఖ సంగీత దర్శకుడు అచు రాజామణి అందించిన మధురమైన స్వరాలతో ‘నీ వల్లే’ ఒక హృద్యమైన రొమాంటిక్ మెలోడీగా రూపుదిద్దుకుంది. విక్రమ్ శివ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు.సిద్ శ్రీరామ్ – అచు రాజామణి కాంబినేషన్‌లో మెలోడీ మ్యాజిక్
‘నీ వల్లే’ పాటలో అచు రాజామణి అందించిన సంగీతం ప్రేమ, భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. మెలోడీకి తగిన ఆహ్లాదకరమైన ఆర్కెస్ట్రేషన్‌తో పాటను అందంగా తీర్చిదిద్దారు. సిద్ శ్రీరామ్ తన విలక్షణమైన గాత్రంతో ఈ పాటకు మరింత భావోద్వేగాన్ని జోడించారు.నిఖిల్ విజయేంద్ర సింహా, తేజు అశ్విని మధ్య ప్రేమను, వారి కెమిస్ట్రీని పరిచయం చేసేలా ఈ పాటను చిత్రీకరించారు. హృద్యమైన సాహిత్యం, మధురమైన సంగీతం, సిద్ శ్రీరామ్ గాత్రం కలసి ‘నీ వల్లే’ను ఆకట్టుకునే రొమాంటిక్ మెలోడీగా నిలిపాయి.తొలి పాటను విడుదల చేయడం ద్వారా ‘సంగీత్’ మ్యూజికల్ జర్నీకి మేకర్స్ ప్రత్యేకంగా శ్రీకారం చుట్టారు.
లహరి ఫిల్మ్స్ – ఆర్‌బీ స్టూడియోస్ సంయుక్తంగా ‘సంగీత్’
లహరి ఫిల్మ్స్, ఆర్‌బీ స్టూడియోస్ బ్యానర్లపై జి. మనోహరన్, ఎల్. బాలకృష్ణ సమర్పణలో ‘సంగీత్’ తెరకెక్కుతోంది.
‘రైటర్ పద్మభూషణ్’, ‘మెమ్ ఫేమస్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన లహరి ఫిల్మ్స్.. భారతీయ సినిమా సంగీతంతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తూ ‘సంగీత్’తో మరో ఆసక్తికరమైన తెలుగు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.
నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, శ్రవంతి నవీన్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, మాజ్ ఖాన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
సంగీతం, ప్రేమ, కొత్త తరహా నటీనటులు, సమకాలీన కథనంతో ‘సంగీత్’ను నేటి ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందిస్తున్నారు.
‘సంగీత్’తో హీరోగా నిఖిల్ విజయేంద్ర సింహా పరిచయం

కన్నడలో తెరకెక్కిన ‘హంబుల్ పొలిటీషియన్ నోగ్రాజ్’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందిన సాద్ ఖాన్ ‘సంగీత్’కు దర్శకత్వం వహిస్తున్నారు. సాద్ ఖాన్, సిద్ధాంత్ సుందర్ కలిసి కథను రచించారు.
ప్రముఖ డిజిటల్ పర్సనాలిటీ, పోడ్‌కాస్ట్ హోస్ట్‌గా గుర్తింపు పొందిన నిఖిల్ విజయేంద్ర సింహా ‘సంగీత్’తో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆయనకు జోడీగా తేజు అశ్విని నటిస్తున్నారు.
నిఖిల్, తేజు జంటలోని ఫ్రెష్‌నెస్ ‘సంగీత్’కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తాజాగా విడుదలైన ‘నీ వల్లే’ పాట వారి మధ్య ప్రేమ, కెమిస్ట్రీని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.
‘నీ వల్లే’కు ప్రేక్షకుల నుంచి స్పందన
‘సంగీత్’ తొలి పాట ‘నీ వల్లే’ ప్రస్తుతం ప్రముఖ మ్యూజిక్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నిఖిల్ విజయేంద్ర సింహా, తేజు అశ్విని కనిపించే ఈ పాటకు సిద్ శ్రీరామ్ గాత్రం, అచు రాజామణి సంగీతం, విక్రమ్ శివ సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తొలి పాట విడుదలతో ‘సంగీత్’ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు అధికారికంగా శ్రీకారం చుట్టిన మేకర్స్.. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను వెల్లడించనున్నారు.
============================