ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 6:08 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా స్థలాన్ని పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి…

కొలిమిగుండ్ల ,జులై 1,అర్జున్ సమాచారం :
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ తో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం నాడు స్థలాన్ని పరిశీలించారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బనగానపల్లె నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా పట్టణంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
====================