సొంత ప్రభుత్వం పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం
హైదరాబాద్,అర్జున్ సమాచారం: పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాజ్ కుమార్ బెయిల్పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి మండిపడ్డారు. రాజ్ కుమార్ దగ్గర లంచం తీసుకుని పోలీసులు విడుదలకు సహకరించారన్న విషయం తెలిసి షాక్కు గురయ్యాను. పోలీసులు చేసిన తప్పుతో నిందితుడు ఆరుగురి ప్రాణాలను కడతేర్చాడు. మహిళలకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం, ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి, మహిళల శాంతి,...