ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:25 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వీరభద్రస్వామి ఆలయంలో మంత్రి పొన్నం వరుణ యాగం

కొత్తకొండ,అర్జున్ సమాచారం:
రాష్ట్రం లో సమృద్ధి వర్షాలు కురవాలని కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వరుణ యాగం , యజ్ఞ యాగాలు నిర్వహించారు.ఎల్ నినో పోయి రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి ,పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని స్వామి వారికి 108 కలషాలతో అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో,సర్పంచ్ లు  ,మార్కెట్ కమిటీ చైర్మన్ లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి మహిమ గల దేవుడు.. ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసం కలిగిన భగవంతుడు.. ఇక్కడ వరుణయగం చేయడం వల్ల ఈ ప్రాంతమంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని స్వామి వారికి  108 కలశలతో అభిషేకాలు చేయడం జరిగింది. స్వామి వారికి యజ్ఞ యాగాలు చేయడం జరిగింది..  ఎల్ నినో పరిస్థితుల్లో వర్షాలు పడవని  శాస్త్రవేత్తలు చెబుతున్న  సమాజం భగవంతుని  మీద విశ్వాసం ఉన్న దృశ్య  యావత్ తెలంగాణ అన్ని దేవాలయాల్లో  వరుణ యాగాలు ,ఇతర పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
నేను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి గా హైదరాబాద్ లో జరుగుతున్న బోనాల పండుగ సందర్భంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారిని ప్రార్థిస్తూ మంచి వర్షాలు పడాలని పూజలు చేయడం జరుగుతుంది . మహిమత్వం గల కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో వరుణయాగం చేసి మంచి వర్షాలు పడాలని స్వామి వారిని వేడుకోవడం జరిగింది.. తెలంగాణ రాష్ట్రం దేశమంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించడం జరిగిందని అన్నారు.