పొగాకు రైతుల నిరసన కార్యక్రమం రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు
ప్రకాశం జిల్లా, అర్జున్ సమాచారం: పొగాకు రైతులు చేపట్టనున్న నిరసన కార్యక్రమం నేపథ్యంలో, మంగళవారం జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు పోలీసు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉన్నప్పటికీ, నేషనల్ హై రోడ్డు దిగ్బంధం చేయడం, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలకు...