హనుమకొండ అథ్లెటిక్స్ వేదికపై శార్వాణి పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ పతకాల పంట!
చెన్నూరు, ఆగస్టు 9 (అర్జున్ సమాచారం):
క్రీడా రంగంలో చెన్నూరులోని శార్వాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. ఆగస్టు 7, 2026 న హనుమకొండ వేదికగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ మీట్ (5వ జాతీయ జావెలిన్ డే ఛాంపియన్ షిప్) పోటీలలో శార్వాణి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రికార్డు స్థాయిలో పతకాలు సాధించారు. కఠినమైన దీక్ష, పట్టుదల, క్రీడాస్ఫూర్తితో పోటీపడి పాఠశాల పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు.
ఈ పోటీలలో పాఠశాల విద్యార్థులు వివిధ విభాగాలలో సత్తా చాటుతూ పతకాలను కైవసం చేసుకున్నారు.
విజేతల వివరాలు:
పొన్నాల హరికృష్ణ: 60 మీటర్లరుగురు పరుగు పోటీలో రజత పతకం (సెకండ్ ప్లేస్) సాధించారు.
పోలం శశాంక్: 300 మీటర్ల పరుగు పందెంలో అద్భుతమైన వేగంతో ప్రదర్శననిచ్చి రజత పతకం సొంతం చేసుకున్నారు.
పాడాల రామచరణ్: లాంగ్ జంప్ విభాగంలో అంచనాలను తలక్రిందులు చేస్తూ అద్భుతమైన ప్రతిభతో రజత పతకం గెలుచుకున్నారు.
కుర్సెంగ మనువైష్ణవి: బాలికల విభాగంలో జరిగిన లాంగ్ జంప్ పోటీలలో అంకితభావంతో రాణించి కాంస్య పతకం (థర్డ్ ప్లేస్) కైవసం చేసుకున్నారు.
విద్యార్థుల ఈ చారిత్రాత్మక విజయాలపై పాఠశాల కరస్పాండెంట్ శ్రీ మేడా శ్రవణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, వారిలో క్రీడాస్ఫూర్తిని నింపుతున్న కరస్పాండెంట్ ప్రోత్సాహం ఈ విజయాలకు పునాదిగా నిలిచింది.
అలాగే, విద్యార్థులకు నిరంతరం శ్రద్ధతో కూడిన శిక్షణనిచ్చి, వారిని సమాయత్తం చేయడంలో కీలక పాత్ర పోషించిన పీఈటీ అధ్యాపకులు శ్రీ శ్రీజన్ మరియు శ్రీ స్వామిల సేవలను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర స్థాయిలో పాఠశాలకీ, స్థానిక ప్రాంతానికి పేరు తెచ్చిన ఈ యువ క్రీడాకారులను తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఘనంగా అభినందిస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ వీరు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.