80 ఏళ్ల భారతవని… ఎన్నో మార్పులు… అయినా.. ఇంకా…

న్యూఢిల్లీ, ఆగస్టు 14,అర్జున్ సమాచారం: భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో, ప్రజల ఆర్థిక అలవాట్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ప్రాథమిక అవసరాలకే పరిమితమైన కుటుంబాలు, ఇవాళ ప్రీమియం ఉత్పత్తులు, విదేశీ ప్రయాణాలు, వినోదంపై ఖర్చు చేస్తున్నాయి. స్థిరత్వం కోసం బ్యాంకు డిపాజిట్లపై ఆధారపడే స్థాయి నుండి, సంపద సృష్టి కోసం ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే స్థాయికి భారతీయ మధ్యతరగతి వర్గం అద్భుతంగా ఎదిగింది.భారత్ 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందినప్పుడు, పేదరికం, నిరక్షరాస్యత, ఆహార అభద్రత ఎక్కువగా...