ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 7:08 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గోనెల మధుసూదన్ మరణం.సింగరేణి విశ్రాంతకార్మికుల ఉద్యమానికి తీరని లోటు.

గోనెల మధుసూదన్ మరణం.సింగరేణి విశ్రాంతకార్మికుల ఉద్యమానికి తీరని లోటు.

.. కోల్ బెల్ట్ ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 16 .

సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు గోనెల మధుసూదన్ మరణం రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి తీరని బాధను నష్టాన్ని మిగిల్చిందని ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంతాప సభలో మధుసూదన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ఆ సంఘం నాయకులు గజెల్లి వెంకటయ్య గౌరవ అధ్యక్షులు రాళ్ల బండి రాజన్న లు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ సింగరేణిలోని మందమర్రి ఏరియాలో సర్వే డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తూ అంకిత భావంతో కార్మికులకు ఎదురవుతున్న అనేక సమస్యల పైన ఆయన ముందుండి నడిచారని బెల్లంపల్లి లోని హనుమాన్ బస్తి 24 దీప్ ఏరియాలో కంపెనీ కోటర్ లో నివసిస్తూ ఎన్నో కార్మిక పోరాటాలు పాల్గొన్నారు జీవనం సాగిస్తున్నారని ఆయన ఆకస్మికంగా మరణించడం రిటైర్డ్ కార్మికుల పోరాటాలకు నష్టదాయకమని అంకితభావంతో ఉద్యమాలను ఆదర్శంగా భావిస్తూ కార్మిక హక్కుల కోసం రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల కోసం జరిగిన జరుగుతున్న పోరాటాలలో ఆయనని స్వార్ధంగా పాల్గొనేవారు అని ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు మధుసూదన్ అమర్. హాయ్ అంటూ ఆయనకు జోహార్లు అర్పించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య ఉపాధ్యక్షులు గెలబోయిన గంగయ్య జిల్లా నాయకులు మామిడాల అంజయ్య నలగొండ సదాశివ పోతరాజుల చంద్రయ్య జ్ఞాని కాటం లక్ష్మణ్ అడిచర్ల రాజేశం ఇందారపు రాజన్న చొప్పదండి బాబు గోల్కొండ లక్ష్మీనారాయణ గజెల్లి సుదర్శన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు