మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. మహాలక్ష్మి హామీ అమలుకు కట్టుబడి ఉన్నాం దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక జాబ్ పోర్టల్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ మెదక్ ఖిల్లాకు ప్రత్యేక తపాలా కవర్ ఆవిష్కరణ కస్తూర్బా విద్యాలయంలో నూతన భవన ప్రారంభం
మెదక్,అర్జున్ సమాచారం: యువతకు నైపుణ్య శిక్షణ, మహిళలకు ఆర్థిక స్వావలంబన, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జీ. వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని శాంతా బయోటెక్నాలజీస్లో మెదక్ కలెక్టర్, స్థానిక పాలనా యంత్రాంగం, ITDC భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక జాబ్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా...