ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్దివంగత రాజశేఖర్ రెడ్డికి నివాళుల్పించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్

దివంగత రాజశేఖర్ రెడ్డికి నివాళుల్పించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి అని ని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి  వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి  ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
సాగు నీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగు రోడ్డు వంటి అభివృద్ధి పనులు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో పాలనపై చెరగని ముద్ర వేసిన నాయకుడని ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. దివంగత నేత వైఎస్సార్ కి నివాళులర్పించిన వారిలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , డాక్టర్ మల్లు రవి , సురేశ్ షెట్కార్ , పోరిక బలరాం నాయక్  ఉన్నారు.

Previous article
ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ పరిశీలించిన ఎంపీ ఈటల కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన మెట్లను పరిశీలించిన ఆయన, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొద్దికాలం క్రితం ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ మెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్ తన చొరవతో హుటాహుటిన నూతన మెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన సమస్యలు మరియు స్థానికుల విజ్ఞప్తులు:
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!