ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeతెలంగాణఏఎల్‌పీలో ఎయిర్ ట్యాంకర్ పేలి ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

ఏఎల్‌పీలో ఎయిర్ ట్యాంకర్ పేలి ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

ఏఎల్‌పీలో ఎయిర్ ట్యాంకర్ పేలి ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

గాయపడిన కార్మికులను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలింపు

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, సెప్టెంబర్ 03

రామగుండం ఆర్జీ-3 ఏరియాలోని ఏఎల్‌పీ గనిలో ఎఫ్‌బీఎల్ విభాగంలో గురువారం తెల్లవారుజామున ఎయిర్ ట్యాంకర్ పేలడంతో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్ ట్యాంకర్ భారీ శబ్దంతో పేలడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్ శ్రీనివాస్, సహాయకుడు మనోజ్, ప్రశాంత్, పిట్టర్ కిరణ్, యాక్టింగ్ పిట్టర్ లక్ష్మణ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక సింగరేణి డిస్పెన్సరీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎయిర్ ట్యాంకర్ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సింగరేణి అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!