హైదరాబాద్,అర్జున్ సమాచారం: తెలంగాణ విమోచన చరిత్రను ప్రతి పౌరుడికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
సర్దార్ పటేల్ సంకల్పంవల్లే నిజాం నుండి తెలంగాణకు విమోచనం జరిగింది
కొంతమంది కుహానా సెక్యులర్ వాదులు తెలంగాణలో రాజ్యమేలుతున్నారు.
నిజాం పాలనలో హిందు దేవాలయాలపై దాడులు చేశారు.
ఆడపిల్లలను నగ్నంగా బతకమ్మ ఆడించిన దుర్మార్గుడు నిజాం.
ఎంతో మందిని చంపి రాక్షసంగా వ్యవహరించిన నీచులు రజాకార్లు.
గత సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తురకోళ్ల ఓట్ల కోసం నిజాంను పొగుడుతున్నారు.
తెలంగాణ సమాజం వీళ్లను చూసి సిగ్గు పడుతోంది.
వీళ్లకు డీఎన్ఏ టెస్ట్ చేయాలి
నిజాం పాలనా ఆక్రుత్యాలకు పరకాల, వీరబైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, వెయ్యి ఊడల మర్రిలో పోరాడి అసువులు బాశారు.
నిజాం దారుణాలకు బలైన వారికి ఏం సమాధానం చెబుతారు
సర్దార్ పటేల్ ముందు నిజాం తలొంచితే..కేసీఆర్, రేవంత్ రెడ్డి మాత్రం నిజాంకు సాగిలపడుతున్నారు.
తెలంగాణ విమోచన చరిత్రను మతం కోణంతో చూడటం సిగ్గు చేటు
ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాలను వారం రోజులపాటు నిర్వహిస్తాం
గల్లీగల్లీలోనూ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం.
==============

