ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 4:15 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ముందు ప్రకటించిన విధంగానే పూర్తి పారదర్శకంగా మందమర్రిలు రెండు పడకల గదుల కేటాయింపు

ముందు ప్రకటించిన విధంగానే పూర్తి పారదర్శకంగా మందమర్రిలు రెండు పడకల గదుల కేటాయింపు.

అర్జున్ సమాచారం సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 25 .

మంగళవారం మందమర్రిలో రెండు పడకల గదుల కేటాయింపు పూర్తి పారదర్శకంగా ముందు ప్రకటించిన విధంగానే నిర్వహించినట్టు పాల్గొన్న అధికారులు స్థానిక ( డి సి.పి) ఎం ఆర్ ఓ )మున్సిపల్ కమిషనర్) మందమర్రి పాలవాగు బొడ్డునగల సండ్రోనిపల్లి లోని ఆర్కే గార్డెన్స్ లో ఈ కేటాయింపుల ప్రక్రియను ప్రారంభించారు ముందు తెలిపిన విధంగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ విషయంలో ఎవరైనా తప్పు పట్టినట్లయితే తమను నేరుగా సంప్రదించాలని స్థానిక ఎమ్మార్వో ఈ సందర్భంగా తెలిపారు లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డి.సి.పి మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు తహసిల్దార్ సతీష్ కుమార్ శర్మ ఇందిరమ్మ ఇండ్ల పిడి బండ్ల తో పాటు సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు రెండు పడకల గదుల పథకంలో ఇల్లు కేటాయించడం న్యాయబద్ధంగానే నిర్వహించాలని అర్హులైన లబ్ధిదారులు లక్కీ డ్రా నిర్వహించేటప్పుడు వారి సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా నిర్వహించడం జరుగుతుందని ఈరోజు కూడా అదే జరిగిందని ఆయన తెలిపారు మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారి చే నిర్ణయించబడిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేశామని ఆయన పేర్కొన్నారు.