ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 8:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గోడ దూకి కళాశాల నుంచి బయటకు వెళ్లిన ఇంటర్ విద్యార్థులు

గోడ దూకి కళాశాల నుంచి బయటకు వెళ్లిన ఇంటర్ విద్యార్థులు

అర్జున్ సమాచారం బెల్లంపల్లి నియోజకవర్గం ప్రజానిధి ఆగస్టు 2

*అధ్యాపకుల కొరతపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లేందుకు యత్నం.. రంగంలోకి దిగిన పోలీసు బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని సీఓఈ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొందరు విద్యార్థులు గోడ దూకి కళాశాల నుంచి బయటకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. కళాశాలలో అధ్యాపకుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం తెల్లవారుజామున కళాశాల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వెళ్లిన విషయాన్ని గుర్తించిన అధ్యాపకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై విద్యార్థుల ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. విద్యార్థులు బెల్లంపల్లి నుంచి భాగ్యనగర్ వెళ్లే రైలు ఎక్కేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులతో మాట్లాడి వారిని తిరిగి కళాశాలకు తీసుకొచ్చారు.
అనంతరం కళాశాల అధ్యాపకులు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అధ్యాపకుల కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో విద్యార్థులు శాంతించి తిరిగి కళాశాలకు చేరుకున్నారు. కొద్దిసేపు కళాశాల పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అధ్యాపకులు, పోలీసుల జోక్యంతో సద్దుమణిగాయి. అయితే విద్యార్థులు కళాశాల గోడ దూకి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడం అధ్యాపకులు, కళాశాల సిబ్బందిలో ఆందోళనకు కారణమైంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కళాశాల యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అదే సమయంలో విద్యార్థులు ప్రస్తావించిన అధ్యాపకుల కొరత సమస్యను అధికారులు పరిశీలించి, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తగిన బోధనా సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.