ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై జేపీసీ. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5, (అర్జున్ సమాచారం ప్రతినిధి.) విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026 పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. బిహార్ బీజేపీ ఎంపీ, లోక్‌సభలో బీజేపీ చీఫ్ విప్ డాక్టర్ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో కూడిన జాయింట్ కమిటీ, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు, పలు అంశాలను పరిశీలించనుంది.  FCRA జాయింట్ పార్లమెంటరీ కమిటీలో పలు రాజకీయ పార్టీలకు చెందిన...