ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:30 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆసుపత్రిలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోట చంద్రయ్యను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.

ఆసుపత్రిలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోట చంద్రయ్యను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.

అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 20 | కరీంనగర్ డెస్క్.

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట చంద్రయ్య, పన్నూరు గ్రామానికి చెందిన తడక శ్రీనివాస్ గుండె సంబంధిత శస్త్రచికిత్స అనంతరం కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు.

ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో. మాజీ జెడ్పిటిసి మైదo భారతి -వరప్రసాద్.పన్నూరు గ్రామ మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ చిందం మహేష్, రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కూరి అవినాష్ గౌడ్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి అరెల్లి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.