ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 3:01 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పత్రికా ప్రకటన. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి TGEJAC రాష్ట్ర కమిటీపిలుపు మేరకు చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి.

పత్రికా ప్రకటన. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి TGEJAC రాష్ట్ర కమిటీపిలుపు మేరకు చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి.

మంచిర్యాల.అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 7.

  • తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ గారి సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు గారి మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తేదీ 10.09.2026 గురువారం రోజున చలో హైదరాబాద్ కార్యక్రమం ను విజయవంతం చేయడానికి TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారి మరియు సెక్రటరీ జనరల్ శ్రీమతి వనజా రెడ్డి గార్ల ఆధ్వర్యం లో IDOC నస్పూర్ మంచిర్యాలలో ముందస్తు సన్నాహక సమావేశం నిర్వహించి చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగినది. TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర TGEJAC సెప్టెంబర్ 10వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం ను విజయవంతం చేయడానికి మంచిర్యాల జిల్లా నుంచి 5 వేల ఉద్యోగులు తక్కువ కాకుండా చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల పెన్షన్ సమస్యలను పరిష్కారం కొరకు మంచిర్యాల నుంచి పెద్ద ఎత్తున హాజరుకావాలని తెలపడం జరిగినది. తదుపరి చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగినది. సెక్రెటరీ జనరల్ శ్రీమతి వనజా రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మిక పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కావడానికి మంచిర్యాల జిల్లాలోని ప్రతి ఒక్క ఉద్యోగి చల్లా హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగుల సమస్యలపై పోరాడాలని తెలపడం జరిగినది. ఈ సన్నాహక సమావేశంలో మంచిర్యాల జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ దుర్గాప్రసాద్ గారు కార్యదర్శి DRDO& DPO శ్రీ కిషన్ గారు CEO శ్రీ గణపతి గారు DWO శ్రీ మతి రాజేశ్వరి మేడం గారు
    కో-చైర్మన్లు పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు డిప్యూటీ సెక్రటరీ జనరల్ అత్తే సుధాకర్ , బొడ్డు శ్రావణ్ తంగళ్ళపల్లి తిరుపతి, సత్యనారాయణ, ప్రభు మరియు టీజీవో,టీఎన్జీఓ, నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు నాయకులు మరియు జిల్లా లోని అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.