ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 3:16 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులకు రూ.300 కోట్లు విడుదలమంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులకు రూ.300 కోట్లు విడుదలమంత్రి పొంగులేటి

జగిత్యాల. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 22.

పేదలకు ఇళ్ల పథకంలో కేంద్రం నుంచి రాఇవ్వాల్సిన రూ.72 వేల నిధుల్లో జాప్యం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.. జగిత్యాలలో ఉమ్మడి కరీంనగర్ 4 జిల్లాలపై మంత్రి   సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల L-3 సమస్యలను నెలాఖరులోగా, లబ్ధిదారుల ఎంపికను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తుది బిల్లులు 15 రోజుల్లో చెల్లిస్తామని తెలిపారు. భూ రీ-సర్వేతో 99% రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అవినీతిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కేంద్రం ఆలస్యం చేసినా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టబోమన్నారు. 2026 మార్చి 31 వరకు పూర్తైన ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులకు రూ.300 కోట్లు సోమవారం విడుదల చేస్తామని తెలిపారు. మిగతా బిల్లులనూ చెల్లిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలని అన్నారు.