ePaper
Friday, August 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎర్రచందనం ముద్దాయిపై పీడీ యాక్ట్ ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న టాస్క్ ఫోర్స్

ఎర్రచందనం ముద్దాయిపై పీడీ యాక్ట్ ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న టాస్క్ ఫోర్స్

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం  :  ఎర్రచందనం అక్రమ రవాణాకు చెందిన పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న కేరళ కు చెందిన నాసర్ కెఎన్ ఎలియాస్ నాసర్ భాయ్ (53)  పై టాస్క్ ఫోర్స్ అధికారులు పీడీ యాక్ట్ అమలు చేశారు.
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే కాకుండా, ఎక్కువ కేసుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా వృత్తిగా చేసుకుని, ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ లు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా  కేరళ కు చెందిన నాసర్ కెఎన్ ఎలియాస్ నాసర్ భాయ్ తమిళనాడు లోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలయంలో ఉంటూ ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇతనిపై పీడీ యాక్ట్ అమలుకు టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసింది. ఈ మేరకు తిరుపతి  జిల్లా కలెక్టరు, జిల్లా మెజిస్ట్రేట్  డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ గారు, ఇతనిపై పీడీ యాక్ట్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను ఎర్రచందనం కొల్లగొట్టడుతూ, వన్య మృగాల చట్టాలను ఉల్లంఘించి నేరాలు చేస్తూ ప్రజాజీవనానికి అటంకం కలిగిస్తున్నట్లు గుర్తించారు. ఇతనిపై ఆరు ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇతనిపై పీడీ యాక్ట్ అమలులో భాగంగా నిందితుడిని కడప సెంట్రల్  జైలుకు తరలించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధకంలో భాగంగా పీడీ యాక్ట్ అమలు చేయడానికి వెనుకాడబోమని టాస్క్ ఫోర్సు ఎస్పీ  హెచ్చరించారు. ఎర్రచందనం కేసుల్లో ఇప్పటికే అనేక మందికి శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. యువత ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రయత్నించి వారి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పారు. స్మగ్లర్లకు శిక్ష పడటంతో పాటు వారి ఆస్తులు కూడా జప్తు చేసుకో పడతాయని తెలియజేసారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!