ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeతెలంగాణకాజీపేటలో భారీగా గంజాయి పట్టివేత: ఇద్దరు నిందితుల అరెస్ట్ ఆటో సీజ్

కాజీపేటలో భారీగా గంజాయి పట్టివేత: ఇద్దరు నిందితుల అరెస్ట్ ఆటో సీజ్

📰 Generate e-Paper Clip

హనుమకొండ , అర్జున్ సమాచారం :
హనుమకొండ జిల్లా కాజీపేట పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల నుంచి సుమారు రూ.70,000 విలువైన గంజాయిని, రవాణాకు ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘటన వివరాలు:
కాజీపేట ఉమెన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎస్. మౌనిక  కాజీపేట ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కడిపికొండ బ్రిడ్జి కింద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్లాస్టిక్ కవర్‌తో కనిపించారు. పోలీసులను చూడగానే వారు పారిపోవడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు.
నిందితుల వివరాలు:
విచారణలో నిందితులను ఈ కింది విధంగా గుర్తించారు.
బొల్ల ప్రవీణ్ కుమార్ కడిపికొండ, హనుమకొండ నివాసి వృత్తి డైరీ ఫామ్,
మొహమ్మద్ అఫ్టాల్ పాషా కాజీపేట నివాసి వృత్తి ఆటో డ్రైవర్,
ఈ కేసులో మరో నిందితుడైన ఎండి సల్మాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్ర నుంచి సరఫరా
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు గతంలో స్ట్రైట్ జాన్ స్కూల్‌లో చదువుకున్నప్పటి నుండి గంజాయికి బానిసలయ్యారని తేలింది. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, మహారాష్ట్రలో తక్కువ ధరకు రూ.10,000 గంజాయిని కొనుగోలు చేసి, ఇక్కడ కాజీపేట ప్రాంతంలో రూ. 70,000కు విక్రయించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఆటో నెంబర్ TS03-UD-4914 లో తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
గంజాయి1 కేజీ 400 గ్రాములు విలువ సుమారు రూ. 70,000,
వాహనం బజాజ్ ఆటో TS03-UD-4914,
రెండు సెల్ ఫోన్లు రెడ్‌మి13 ప్రో మరియు ఒప్పో A96,
చట్టపరమైన చర్యలు
కాజీపేట తహసిల్దార్ సమక్షంలో గంజాయిని తూకం వేసి, నిబంధనల ప్రకారం సీజ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!