ePaper
Monday, August 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాబోయే నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి లోకేష్

కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి లోకేష్

📰 Generate e-Paper Clip

తిరుపతి,అర్జున్ సమాచారం :
తిరుపతి భూపాల్ హౌసింగ్ లోని టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కే.గౌతమి శ్వేత నివాసాన్ని గురువారం ఉదయం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. కాబోయే నూతన వధూవరులు ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, కే.గౌతమి శ్వేతలను మంత్రి లోకేష్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సమక్షంలో వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. గురువారం రాత్రి తిరుమలలోని శ్రీ శృంగేరీ శారద పీఠంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతల వివాహం జరగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!