ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeసినిమాఘనంగా "మగాళ్లు జిందాబాద్" సినిమా టైటిల్ లాంచ్

ఘనంగా “మగాళ్లు జిందాబాద్” సినిమా టైటిల్ లాంచ్

📰 Generate e-Paper Clip

గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మాతలుగా యంగ్ హీరో శ్రీ నందు, స్టార్ కమెడియన్స్ వెన్నెల కిషోర్, వైవాహర్ష నటిస్తున్న తాజా చిత్రం మగాళ్లు జిందాబాద్. నార ప్రవీణ్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. తెలుగు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి శిష్యుడిగా నారా ప్రవీణ్ సినిమా టైటిల్ తోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. కామెడీ కంటెంట్ లకు మంచి ఆదరణ దక్కుతున్న ఈ సమయంలో అద్భుతమైన టైటిల్, అంతే వినోదపరితమైన కంటెంట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలో వస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.
డైరెక్టర్ నార ప్రవీణ్ మాట్లాడుతూ.. ఇదొక సెటైరికల్ కామెడీ ఫిలిం అని అందుకోసమే మగాళ్లు జిందాబాద్ అనే టైటిల్ పెట్టామని పేర్కొన్నారు.  సొసైటీలో ఆడవారికి దక్కే కంఫర్ట్ గాని, న్యాయం కానీ, సింపతీ కానీ మగాడికి దక్కట్లేదు అనే టాపిక్ ను సెటైరికల్ టోన్ లో డీల్ చేస్తూ ఔట్ అండ్ ఔట్ కామెడీ జెనరేట్ చేశాం అని ,ఇది ఒక సోషల్ సెటైరికల్ మూవీ అని చెప్పారు. దీని మీదే ఈ సినిమా చాలా ఆహ్లాదకరమైన కామెడీతో సాగుతుందని వెల్లడించారు.
హీరోయిన్ లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ.. మగాళ్లు జిందాబాద్ సినిమా అందరికీ నచ్చుతుందని, తనను నమ్మి మొదటి సినిమాగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అందుకే సినిమా జిందాబాద్ అని వెల్లడించారు. మగాళ్లు జిందాబాద్ సినిమాను తప్పకుండా ఆదరించాలని కోరారు.
హీరో శ్రీ నందు మాట్లాడుతూ మగాళ్లు జిందాబాద్ ఈ టైటిల్ చాలామందిలో ఆలోచనలను రేకెత్తిస్తుంది. మరికొందరికి నవ్వు తెప్పిస్తుంది. ఆడవాళ్లను డామినేట్ చేయడానికి ఈ టైటిల్ పెట్టలేదు. మగవాళ్ళ భావాలు, బాధలు, కష్టాలు చెప్పుకోవడానికి చాలామంది ఆలోచిస్తారు. అలాంటి వారి కోసమే ఈ టైటిల్ అనే హీరో శ్రీ నందు తెలిపారు. మరీ ముఖ్యంగా సమాజంలో ఎదురవుతున్న అనేక సవాలను ఎదుర్కొనే నిలబడుతున్నందుకు మగాళ్లు జిందాబాద్ అంతేకానీ ఆడవాళ్లను తక్కువ చేయడం కాదు, ఆడవాళ్లు ఎప్పుడూ గ్రేట్ అందుకే ఆడవాళ్లు జోహార్ అని అన్నారు. నిజ జీవితంలో మగవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను సినిమాలో వినోదపరితంగా చూపించడం కోసమే ఈ సినిమా అని ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల వరకు కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకునే సినిమాని తెలిపారు. మగవాళ్లు చాలామంది ఈ సినిమాతో కనెక్ట్ అవుతారని, అప్పుల బాధలు, ఈఎంఐ బాధలు ఇవి మగవాళ్ళకే తెలుసని అన్నారు. సైక్ సిద్ధార్థ్, అగ్లీ స్టోరీ ఈ రెండు సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లో ఎక్కువమంది చూడలేదు కానీ మగాళ్లు జిందాబాద్ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆడియన్స్ తో మీడియా సమక్షంలో పంచుకుంటానని ఇది కేవలం టైటిల్ లాంచ్ మాత్రమే అని హీరో శ్రీ నందు తెలిపారు.
నిర్మాత ప్రసాద్ భాస్కర్ల మాట్లాడుతూ.. హీరో శ్రీ నందుకు ఇప్పటివరకు సరైన కంటెంట్ పడలేదని, మగాళ్లు జిందాబాద్ చిత్రం ఆయనకు కమర్షియల్ గా మంచి మైలేజ్ తీసుకొస్తుందని. ఈ సినిమాలో శ్రీ నందు నటన, డాన్స్, కామెడీ టైమింగ్ అంతా అద్భుతంగా ఉందని తెలిపారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, శ్రీ నందు పోటాపోటీగా నటించి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని, త్వరలోనే ఆడియన్స్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తారని వెల్లడించారు.
=============================
48ఈ నెల 21న విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఏందయ్యా సామీ..’ రిలీజ్
అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఏందయ్యా సామీ..’ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. విజయ్, రశ్మిక పెళ్లి సందర్భంగా రిలీజ్ చేసిన ‘ఏందయ్యా సామీ..’ సాంగ్ ప్రోమో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ ఫుల్ వెర్షన్ సాంగ్ కోసం ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న వివాహం తర్వాత కలిసి నటిస్తున్న సినిమాగా అటు వారి ఫ్యాన్స్ లోనూ, ఇటు మూవీ లవర్స్ లోనూ “రణబాలి” సినిమా ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది.
నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!