హైదరాబాద్ ,అర్జున్ సమాచారం :
శంషాబాద్ ఎయిర్పోర్టులో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలు అరెస్ట్ చేసారు. వీరంతా ఒమన్ ఎయిర్వేస్లో నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించారు. నకిలీ వీసాలను గుర్తించడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.తరువాత అందరిని శంషాబాద్ ఔట్పోస్టుకు అప్పగించారు. చెల్లని వీసాలిచ్చి ఏజెంట్ మోసం చేశాడని మహిళలు వాపోయారు.
========================
