ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య .

ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య .

📰 Generate e-Paper Clip

ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య .


హైదరాబాద్. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 12


ఎల్బీ నగర్ ఏపీసీ కార్యాలయంలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.  బుధవారం  తెల్లవారుజామున 2.30 గంటలకు ఘటన చోటు చేసుకుంది. మృతుడు ఎల్బీనగర్ పీఎస్కు చెందిన PC J. సాయికుమార్ (13128). ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్రూమ్లో ఉరివేసుకున్నట్లు గుర్తించారు.  సాయికుమార్ 2024 బ్యాచ్లో ఎంపికయ్యాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్మెంట్ లో వున్నాడు. కర్మన్ఘాట్లో స్నేహితులతో కలిసి ఓ గదిలో నివాసం వున్నాడు.  ఘటన సమాచారం అందుకున్న వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.  ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎల్బీనగర్  పోలీస్ స్టేషన్  ముందు మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!