జోగులాంబ,అర్జున్ సమాచారం:
పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని అందులో భాగంగానే గేదెల కొనుగోలుకు సహకారం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన మినీ డైరీ పథకానికి ఎంపికైన 12 మంది రైతులు గేదెలు కొనుగోలు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళుతున్న సందర్భంగా శుక్రవారం ఐడిఓసి ఆవరణలో వాహనాన్ని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు గేదెల కొనుగోలుకు రూ.2 లక్షలకు గాను 60 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని,మిగిలిన 40 శాతం బ్యాంకు లోన్ పొందడం జరుగుతుందన్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మంచి అధిక పాల ఉత్పత్తినినంబర్ ప్లేట్ లేని, నిబంధనలకు విరుద్ధమైన వాహనాలపై మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు – అట్టి వాహనాలపై చర్యలు
జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నెంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాలను శుక్రవారం మహబూబ్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు లేకుండా లేదా అస్పష్టంగా, కొన్ని అంకెలు తొలగించి తిరుగుతున్న వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనదారులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించి, మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అనంతరం ఆయా వాహనాలకు నిబంధనలకు అనుగుణంగా సరైన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడం లేదా చైన్ స్నాచింగ్లు, ఇతర నేరాలకు పాల్పడినప్పుడు గుర్తింపు తప్పించుకునే ఉద్దేశంతో నంబర్ ప్లేట్లు లేకుండా లేదా నంబర్లను మార్పులు చేసి వాహనాలను నడుపుతున్నట్లు గుర్తిస్తున్నామని తెలిపారు. ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధమని, నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొన్నారు.
అందువల్ల ప్రతి వాహనదారు తమ వాహనాలకు నిబంధనలకు అనుగుణంగా స్పష్టంగా కనిపించే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు.
“ప్రజల భద్రతే మా ధ్యేయం – ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం… రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం ఇచ్చే గేదెలు ఉండడంతో పాడి రైతులను అక్కడికి పంపిస్తున్నట్లు తెలిపారు.గేదెల కొనుగోలుకు సంబంధిత శాఖల పలువురు అధికారులు కూడా రైతుల వెంట అక్కడికి వెళ్లి సహకరిస్తారన్నారు.రైతులు కొనుగోలు చేసిన గేదెలు జాగ్రత్తగా వారి ఇంటికి చేరేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని నుషిత, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట్ నారాయణ,ఎల్డియం శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
=========================
పాడి రైతుల సంక్షేమానికి కృషి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
RELATED ARTICLES
