ePaper
Tuesday, August 25, 2026
ePaper
Homeతెలంగాణమంచిర్యాలఆటో డ్రైవర్ల సమస్యల పై ఐక్య పోరాటం

ఆటో డ్రైవర్ల సమస్యల పై ఐక్య పోరాటం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల,అర్జున్ సమాచారం:
మంచిర్యాల పట్టణంలోని వివేకవర్ధిని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హెచ్ఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఏ (RWA), బీఆర్టీయూ (BRTU), బీఎంఎస్ (BMS), 246 మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్, జేఏసీ ఆటో యూనియన్ తదితర ఆటో యూనియన్ల జిల్లా నాయకులు పాల్గొని, మంచిర్యాల జిల్లా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
నాయకులు మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలు అనంతరం ఆటోలకు గిరాకీ తీవ్రంగా తగ్గిపోయి వేలాది మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాపిడో కార్యకలాపాల కారణంగా కూడా ఆటో డ్రైవర్ల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అన్ని ఆటో యూనియన్లు రాపిడోను అరికట్టేందుకు ఐక్యంగా పోరాటం చేస్తామని, అవసరమైతే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించి రాపిడో కార్యకలాపాలను అడ్డుకుంటామని తీర్మానం చేశారు.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!