మేడ్చల్,అర్జున్ సమాచారం:
మేడ్చల్ జిల్లా నాగారం వెస్ట్ గాంధీనగర్లో విషాదం నెలకొంది. ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దీక్షిత (26) అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీక్షిత బెంగళూరులోని కళాశాలలో పీజీ ఆప్తాల్మాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. పోలీసులు స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
=================
ఐదో అంతస్తు నుంచి దూకి వైద్యా విద్యార్ధిని ఆత్మహత్య
RELATED ARTICLES

