యువకులకు వాలీబాల్ లు అందించిన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కనుకుల రాకేష్
అర్జున్ సమాచారం సెప్టెంబర్ 10 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కనుకుల రాకేష్ మొదలు పెట్టిన నషా ముక్త్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేవాపూర్, మద్దిమాడ యువకులకు వాలీ బాల్ లు అందించడం జరిగినది, ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ యువకులు గంజాయి డ్రగ్స్ కి అలవాటు పడకుండా క్రీడల మీద చదువు మీద ఆసక్తి చూపించాలని అలాగే యువకులు ఇతరులకు కూడా క్రీడల మీద ఆసక్తి వచ్చేలా క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు… ఈ కార్యక్రమం లో పిసీసీ కో ఆర్డినేటర్ ( జె బి ఎం)ప్రవీణ్ బాబు,శ్రీనివాస్,సతీష్,కేశవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

