న్యూఢిల్లీ, జూలై 16,అర్జున్ సమాచారం:
అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరబోతోంది. హోర్ముజ్ జలసంధి గుండా ఇరాన్ రాకపోకలను అమెరికా అడ్డుకుంది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్పై అమెరికా నావికా దళాలు దిగ్బంధనం చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీని అర్థం, ఇరాన్ నౌకలు ఇకపై హోర్ముజ్ జలసంధిని దాటలేవు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఈ ఘర్షణను మరింత తీవ్ర స్థాయికి తీసుకువెళ్లవచ్చు.యూఎస్ సెంట్రల్ కమాండ్ Xలో ఒక పోస్ట్ను షేర్ చేసింది. అందులో ఇలా పేర్కొంది, “ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాల్లోకి ప్రవేశించే, బయలుదేరే నౌకలపై అమెరికా సైన్యం సముద్ర దిగ్బంధనాన్ని పునఃప్రారంభించింది. ప్రస్తుతం 20కి పైగా యూఎస్ నేవీ యుద్ధనౌకలు, వందలాది సైనిక విమానాలు మధ్యప్రాచ్యంలో మోహరించి ఉన్నాయి.”అమెరికా మొదట ఏప్రిల్లో ఇరాన్పై దిగ్బంధనాన్ని విధించి, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే జూన్లో దానిని ఎత్తివేసింది. ఈ ఒప్పందం ప్రకారం 60 రోజుల్లోగా ఇరాన్ అణు కార్యక్రమంపై శాశ్వత ఒప్పందానికి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, కానీ హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చర్చలు ముందుకు సాగలేదు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మొదట హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై 20 శాతం సుంకం విధించాలని ప్రతిపాదించినప్పటికీ, ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గాలలో ఒకటి. యుద్ధానికి ముందు, ప్రపంచంలోని ముడి చమురు, గ్యాస్లో సుమారు 20 శాతం దీని ద్వారా వర్తకం జరిగేది. అయితే, అమెరికా-ఇరాన్ యుద్ధం ఈ మార్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా, యుద్ధం తర్వాత అనేక దేశాలలో చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి
మళ్లీ ఇరాన్ నిర్బంధమే.. డొనాల్డ్ ట్రంప్
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాలుస్తూ అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని పక్కనబెట్టి, ఇరాన్ను తమ నౌకాదళంతో మళ్లీ దిగ్బంధించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ దిగ్బంధం కేవలం ఇరాన్ నౌకలు, వారి ఖాతాదారుల రాకపోకలను మాత్రమే అడ్డుకుంటుందని, ఇతర దేశాల వాణిజ్య నౌకలు హర్మూజ్ జలసంధిని యథావిధిగా వాడుకోవచ్చని స్పష్టం చేశారు.ఇకపై అమెరికానే ఈ జలసంధికి సంరక్షకుడిగా వ్యవహరిస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో నిష్పక్షపాత భద్రత, రక్షణ కల్పించేందుకు అయ్యే ఖర్చుల కోసం అక్కడ ప్రయాణించే అన్ని రకాల వాణిజ్య నౌకల సరకు విలువపై 20 శాతం చొప్పున పన్ను లేదా టోల్ వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సుంకాల వసూలు ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుందని, అమెరికా రక్షణలోనే హర్మూజ్ ఎప్పటికీ సురక్షితంగా తెరిచి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య కత్తులు దూసుకుంటున్న ఈ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
=======================
అగ్రరాజ్యం ముప్పేట దాడి
RELATED ARTICLES

