కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్లోని భగత్నగర్లో గల వారాహి బకెట్ హాల్ వేదికగా జ్యోత్స్న ప్రియ ప్రసన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “త్రిశక్తి సారీస్” చీరల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు విచ్చేసి ఈ చీరల ప్రదర్శనను ప్రారంభించి చీరలను కొనుగోలు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ-వేణు 41వ డివిజన్ కార్పొరేటర్ నాంపల్లి రేణుక- శ్రీనివాస్ బిజెపి నాయకులు పండుగ నాగరాజు, ఉపేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.
===========================

