మచిలీపట్నం బలరాంపేటలో మద్యం మత్తులో వీరంగం..రెండు వర్గాల మధ్య ఘర్షణ
కృష్ణాజిల్లా మచిలీపట్నం, అర్జున్ సమాచారం, జూలై 06
కృష్ణాజిల్లా మచిలీపట్నంపట్టణంలోని బలరాంపేటలో మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఆదివారం సాయంత్రం ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది….దీంతో పలువురికి గాయాలయ్యాయి…
ఘటన అనంతరం న్యాయం చేయాలని కోరుతూ బలరాంపేట వాసులు ఆర్పేట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఇరు వర్గాల వ్యక్తులు మరోసారి ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు గొడవపడుతున్న వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆర్పేట పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
