ముత్తంగి వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టివేత
సంగారెడ్డి, అర్జున్ సమాచారం, జూలై 06
ముత్తంగి ముంబై జాతీయ రహదారి వద్ద ఎప్వోటీ T పోలీసులు వాహనాల తనిఖీలు ,లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టివేసారు. 21క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. సికింద్రాబాద్ మచ్చ బొల్లారం నుండి గుజరాత్ రాష్ట్రం తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యం లారీని స్థానికంగా ఉన్న శ్రీరామ్ గోదాంకు తరలించారు.
