ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణకృత్రిమ ఎరువుల వాడకం తగ్గించాలి,

కృత్రిమ ఎరువుల వాడకం తగ్గించాలి,

📰 Generate e-Paper Clip

కృత్రిమ ఎరువుల వాడకం తగ్గించాలి ,

ఏఈఓ అంజనీ మిశ్ర పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 19:


మంథని మండలం సూర్యపల్లి రైతు వేదికలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ద్వారా నూనెగింజల సాగు, ప్రకృతి వ్యవసాయం, ఇంటి తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ సహాయ సంచాలకులు అంజనీ మిశ్రా, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీ మిశ్రా మాట్లాడుతూ కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించి రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి డాక్టర్ నవ్య నూనెగింజల సాగు, ఇంటి తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు. కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ మాట్లాడుతూ కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!