ePaper
Friday, September 18, 2026
ePaper
Homeజాతియంఢిల్లీమీ క్యాంపస్.. మీ హక్కు..” ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులతో వంశీచంద్ రెడ్డి

మీ క్యాంపస్.. మీ హక్కు..” ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులతో వంశీచంద్ రెడ్డి

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ:అర్జున్ సమాచారం:
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన యువ మిత్రులు, ఉత్సాహభరితమైన విద్యార్థులతో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్‌ఎస్‌ఏ జాతీయ ఇన్‌చార్జ్ శ్రీ వంశీచంద్ రెడ్డి  మమేకమయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ఉత్సాహం, ఆలోచనలు, ప్రజాస్వామ్యంపై వారి నిబద్ధత విశ్వవిద్యాలయ క్యాంపస్‌లు ప్రజాస్వామ్య భాగస్వామ్యం, విద్యార్థుల ప్రాతినిధ్యానికి కీలక వేదికలుగా ఉన్నాయనే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
“మీ క్యాంపస్.. మీ హక్కు” అనే నినాదం విద్యార్థులు తమ క్యాంపస్‌కు సంబంధించిన అంశాలపై చురుకుగా పాల్గొనడం, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడం, అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యను అందించడం, విద్యార్థుల సమస్యలపై మరింత బలమైన ప్రాతినిధ్యాన్ని సాధించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది.
డీయూఎస్‌యూ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా విద్యార్థి సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా సంస్కరణలు, స్కాలర్‌షిప్‌లు, మానసిక ఆరోగ్య సహాయం, కెరీర్ అవకాశాలు వంటి అంశాలను ఎన్‌ఎస్‌యూఐ ప్యానెల్ ప్రస్తావించింది.
6  4 12 ప్యానెల్ ద్వారా విద్యార్థులు డీయూఎస్‌యూ ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొని, తమకు సంబంధించిన సమస్యలపై తమ గొంతును వినిపించాలని పిలుపునిచ్చారు
=============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!