ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeసినిమాప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ పై కేసు నమోదు హైదరాబాద్

ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ పై కేసు నమోదు హైదరాబాద్

📰 Generate e-Paper Clip

నిర్మాత సి. కళ్యాణ్ సున్నం చెరువు ప్రాంతంలోని తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గుట్టల

బేగంపేట్లోని సర్వే నంబర్లు 12, 12A, 13లో తమ ప్లాట్లు ఉన్నాయని ప్లాట్ ఓనర్స్ చెబుతున్నారు. అయితే.. ఇవాళ ఉదయం సి. కళ్యాణ్ పాటు మరికొందరు వ్యక్తులు తమ ప్లాట్లలోకి అక్రమంగా

ప్రవేశించి బ్లూ షీట్లు ఏర్పాటు చేశారని వారు ఆరోపిస్తున్నారు. తమ ప్లాట్లలోకి వెళ్లకుండా షీట్లతో అడ్డుకుంటున్నారని పేర్కొంటూ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. గతంలోనూ తమ ప్లాట్లను కబ్జా

చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై ఫిర్యాదు చేశామని సభ్యులు తెలిపారు. తాజాగా తమ ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సి. కళ్యాణ్, ప్రకాష్ ధారక్, ప్రేమలతపై చర్యలు తీసుకోవాలని

మాదాపూర్ పోలీసులను ప్లాట్ ఓనర్స్ కోరారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!