కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయి మరియు 1 గంజాయి మొక్కను ధ్వంసం చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు.
మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్లో పోలీస్ కమీషనర్ సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి.వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్, శ్రీలత,ఆర్ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
============================
38 కేసుల్లో లభించిన 63.621 కిలోల గంజాయి,1 గంజాయి మొక్క దగ్ధం: కరీంనగర్ సిపి గౌస్ ఆలం.
RELATED ARTICLES

