హైదరాబాద్,అర్జున్ సమాచారం:
మణుగూరు ఓపెన్ కాస్ట్ -2 సింగరేణి కి దక్కడం మంచి పరిణామం. మణుగూరును కాపాడినందుకి సీఎం, డీసీఎం ధన్యవాదములని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి డీప్ బ్లాక్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. సింగరేణి ప్రైవేటికరణ అడ్డుకట్ట వేయడానికి సీఎంకు వినతి లెటర్ ఇచ్చి – సీఎంను కలిసి మాట్లాడారు. సింగరేణి నష్టాలను చూపించి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు కుట్రలు ఇంకా జరుగుతున్నాయి. సింగరేణి అభివృద్ధి చేస్తా అని కేసీఆర్ వైఫల్యం అయ్యారు – ఇప్పుడు కేసీఆర్ లెక్క కాకుండా సింగరేణిని అభివృద్ధి చేయాలని అన్నారు.
సింగరేణిని కాపాడందుకు కేంద్రం పార్లమెంట్ లో బిల్లు చెయాలి. సింగరేణి పై దూరదృష్టి లేకపోతే తెలంగాణలు నష్టం జరుగుతుంది. సింగరేణి పై బ్లూ ప్రింట్ తయారు చేయాలి కోరుతున్నా. సింగరేణికి ప్రభుత్వం 56వేల కోట్లు అప్పు ఉంది… ప్రభుత్వం ఆ నిదులను విడుదల చేయాలి. సింగరేణిని కాపాడెందుకు మేము ఉద్యమం చెస్తాం – ప్రభుత్వం ఈగోకు పోకుండా సమ్మె పై ప్రభుత్వం చర్చలు సఫలం చేయాలి.శ్రాణావపల్లి, సత్తుపల్లి, ఇల్లందు కోయిగూడెం, సత్తుపల్లి – కోయిగూడెం -2, గుండాల, పెనుబల్లి, గారిమెల్ల పాలెం మైన్ చేయాలి. ఆర్టీసీని ఎన్నికలు జరిగిన వెంటనే ఆర్టీసీని విలీనం చేయాలి.. లేదంటే పోరాటం చెస్తామని అన్నారు.
కాళేశ్వరం బ్యారేజిలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. పాలన చేసే వాళ్లంతా మేమే మేధావులం అనుకుంటారు.రాజకీయాల కోసం సంబంధం లేకుండా కామెంట్స్ చేస్తారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి, ఫ్యూచర్ సిటీ పై సీఎం పడ్డారు. ఎప్పుడో జరిగే ఫ్యూచర్ సిటిని పక్కన పెట్టి – ప్రజలు – కార్మికుల సమస్యలను తీర్చాలి. అన్ని శాఖల ఫీజుల బకాయిలు – నిదుల బకాయిలు విడుదల చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టను స్టెప్ని టైప్ అదుబాటులో పెట్టుకోవాలి. బీజేపీ కి మొన్న జెన్ – జి, నిన్న బీహార్ ప్రశాంత్ కిషోర్ విజయం పెద్ద దెబ్బ. బీహాన్ లో ప్రశాంత్ కిషోర్ గెలుపు – రాజకీయాల్లో గొప్ప మలుపు. వర్షాకాల సమావేశాలు కనీసం జరపాలని కోరుతున్నానని అన్నారు.
==================

