ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాలో నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లు ప్రారంభించిన సీపీ

తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాలో నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లు ప్రారంభించిన సీపీ

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంతో పాటు నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ ఔట్‌పోస్ట్ బూత్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామితో పాటు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, సబ్‌-ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
===============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!