హైదరాబాద్,అర్జున్ సమాచారం:
కేంద్ర ప్రభుత్వం రేషన్ సరుకుల విధానంలో కీలక మార్పులు చేస్తోంది. జాతీయ ఆహార భద్రత చట్టం-2013 ప్రకారం,అంత్యోదయ అన్న యోజన, ఏఏవై లబ్ధిదారులకు కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల అందించే విధానాన్ని మార్చి, ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోల చొప్పున ధాన్యం అందించాలని యోచిస్తోంది.అయితే,ఏ కుటుంబానికైనా గరిష్ట పరిమితి 35 కిలోలుగానే కొనసాగుతుంది.ఈ మార్పుల ద్వారా పెద్ద కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సవరణలను ప్రతిపాదించింది.

