బెంగళూరు. (అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 5)
కర్ణాటకలోని కడేచూరు పారిశ్రామికవాడలో ఘోర ప్రమాదం జరిగింది. సీఐఎల్ ల్యాబొరేటరీ ఫ్యాక్టరీలో కెమికల్ లీక్ అయింది. ఘటనలో ముగ్గురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. తెలంగాణకు చెందిన గణేశ్తో పాటు మధ్యప్రదేశ్కు చెందిన విక్రమ్ సింగ్, సంజయ్ సింగ్ మృతి చెందారు. తెలంగాణకు చెందిన శివకుమార్, ఏపీకి చెందిన హేమంత్కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాయచూర్ రిమ్స్ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఫ్యాక్టరీలో భద్రతా లోపాల వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి అయింది

